Posted on 2026-07-10 16:20:54
డైలీ భారత్: రాజన్న సిరిసిల్ల: అతివేగంగా, నిర్లక్ష్యంగా బస్సు నడిపి ముగ్గురి ప్రాణాలు తీసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామ శివారులో 09-07-2026న ఈ ఘోర ప్రమాదం జరిగింది.
మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాకు చెందిన వ్యవసాయ వలస కూలీలను కొదురుపాక గ్రామానికి చెందిన గంగాధర్ అనిల్ తన టాటా ఆటో ట్రాలీ AP 01 X 9735లో లక్ష్మీపూర్ గ్రామానికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు TS23 T4700 ఆటో ట్రాలీని బలంగా ఢీకొట్టింది. బస్సును నడిపింది నిమ్మపల్లి గ్రామానికి చెందిన మాలోత్ నరాన్.
ప్రమాద తీవ్రతకు ఆటో ట్రాలీ బోల్తా పడింది. దీంతో చంద్రపూర్ కు చెందిన అతుల్ వాసుదేవ్ సోనులే 35 సంఘటనా స్థలంలోనే మరణించాడు. ట్రాలీలోని రంజు 48, అర్చన 37 వరంగల్ MGM ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
మిగతా కూలీలు మరియు ఆటో డ్రైవర్ గంగాధర్ అనిల్ కు 108 అంబులెన్సుల ద్వారా సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి, వేములవాడ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ మాలోత్ నరాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
ఈ ఘటనపై జిల్లా పోలీసులు వాహనదారులకు సూచనలు జారీ చేశారు. నిర్ణీత వేగంతో, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >