Posted on 2026-07-10 16:20:54
డైలీ భారత్: రాజన్న సిరిసిల్ల: అతివేగంగా, నిర్లక్ష్యంగా బస్సు నడిపి ముగ్గురి ప్రాణాలు తీసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామ శివారులో 09-07-2026న ఈ ఘోర ప్రమాదం జరిగింది.
మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాకు చెందిన వ్యవసాయ వలస కూలీలను కొదురుపాక గ్రామానికి చెందిన గంగాధర్ అనిల్ తన టాటా ఆటో ట్రాలీ AP 01 X 9735లో లక్ష్మీపూర్ గ్రామానికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు TS23 T4700 ఆటో ట్రాలీని బలంగా ఢీకొట్టింది. బస్సును నడిపింది నిమ్మపల్లి గ్రామానికి చెందిన మాలోత్ నరాన్.
ప్రమాద తీవ్రతకు ఆటో ట్రాలీ బోల్తా పడింది. దీంతో చంద్రపూర్ కు చెందిన అతుల్ వాసుదేవ్ సోనులే 35 సంఘటనా స్థలంలోనే మరణించాడు. ట్రాలీలోని రంజు 48, అర్చన 37 వరంగల్ MGM ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
మిగతా కూలీలు మరియు ఆటో డ్రైవర్ గంగాధర్ అనిల్ కు 108 అంబులెన్సుల ద్వారా సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి, వేములవాడ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ మాలోత్ నరాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
ఈ ఘటనపై జిల్లా పోలీసులు వాహనదారులకు సూచనలు జారీ చేశారు. నిర్ణీత వేగంతో, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >