Posted on 2026-07-10 14:47:58
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతనంగా జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీరామ్ మొండయ్య ని తెలంగాణ రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం TGPETA జిల్లా శాఖ అధ్యక్షులు తడుకల సురేష్, ప్రధాన కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన క్రీడా వసతులు, క్రీడా సామగ్రి అందుబాటులో ఉంచాలని, విద్యార్థుల సంక్షేమంతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని DEOకి సమర్పించారు.
అదేవిధంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిర్వహించనున్న పాఠశాల స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు తమ విలువైన సూచనలు, సలహాలు అందిస్తూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో TGPETA జిల్లా నాయకులు పాల్గొన్నారు.
#TGPETA #RajannaSircilla #DEO #SchoolSports #TelanganaEducation
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >