Posted on 2026-09-10 09:43:29
డైలీ భారత్, రామంతపూర్:వెంకట సాయి నగర్ కాలనీకి చెందిన లక్ష్మణ్ కి శస్త్రచికిత్స అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.19,000 ఆర్థిక సహాయం మంజూరైంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవ, సహకారంతో ఈ ఆర్థిక సహాయం అందింది.
మంజూరైన CMRF చెక్కును కాలనీ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి, కాలనీ గౌరవ సభ్యులు మరియు టీమ్ సభ్యులు కలిసి లక్ష్మణ్ కు అందజేశారు.
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, అవసరమైన సమయంలో వారికి అండగా నిలుస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సేవలు అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్స సమయంలో CMRF వంటి ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ఎమ్మెల్యే చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.
లక్ష్మణ్ కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరట కలిగించేలా CMRF సహాయం అందేందుకు సహకరించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కి కాలనీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు అసోసియేషన్ ద్వారా నాలుగు సి ఎమ్ రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సభ్యులు రవికుమార్,గోపాల్, సంజీవ, శంకర్ ,ఆర్. గోవింద్, అశోక్, శ్రీనివాస్ గౌడ్, భూపతి నరసింహ, రామకృష్ణ, సి.శేఖర్ , స్వామి , నరేష్, బి .చలపతి రావు, వేణుగోపాల్ ఐలేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >