Posted on 2026-09-10 07:03:46
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రమైన బూర్గం పహాడ్ చోటుచేసుకుంది.
ఎస్సై మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం బూర్గంపహాడ్ గ్రామానికి చెందిన సాధనాల నాగేశ్వరరావు(39) మాంసం దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బూర్గంపహాడ్ గ్రామశివారులో ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్నారు. మృతుని సంఘటనా స్థలంలో అశ్వారావుపేట మండలం ఆసుపాకకు చెందిన వ్యక్తి ప్రోద్బలంతో బెట్టింగ్లకు బానిసై ఆర్ధికంగా నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి ఉండటంతో మృతుని భార్య మాధవి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >