Posted on 2026-07-10 18:53:44
డైలీ భారత్, సిరిసిల్ల:ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ పై సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసులు, మున్సిపల్ వర్గాల సమాచారం ప్రకారం...
సిరిసిల్ల మున్సిపాలిటీ 22వ వార్డుకు చెందిన వింగల్ సులోచన ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇల్లు శాంక్షన్ చేయాలంటే వైస్ చైర్మన్ దర్ల సందీప్ ₹1,00,000 లంచం అడిగారని ఆమె ఈ నెల 6న జిల్లా కలెక్టరేట్లో జరిగిన "ప్రజావాణి" కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కమిషనర్ ఫిర్యాదుతో కేసు నమోదు...
బాధితురాలి ఫిర్యాదుపై మున్సిపల్ కమిషనర్ తీవ్రంగా స్పందించారు. నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జూలై 9న సిరిసిల్ల టౌన్ పోలీసులకు అధికారిక లేఖ రాశారు. విచారణకు సహకరించేందుకు 22వ వార్డు ఆఫీసర్ శేఖర్ బాబు, హౌసింగ్ ఏఈ రాజశేఖర్లను నియమించారు.
కమిషనర్ లేఖ ఆధారంగా పోలీసులు గురువారం రాత్రి 7:30 గంటలకు వైస్ చైర్మన్ దార్ల సందీప్పై క్రైమ్ నంబర్ 401/2026 కింద, BNS సెక్షన్ 308(2) r/w 62 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను టౌన్ ఎస్ఐ సి.హెచ్. గణేష్ కు అప్పగించారు.
ప్రభుత్వ పథకం పేరుతో లంచం ఆరోపణలు రావడంతో సిరిసిల్లలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >