Posted on 2026-06-19 17:03:12
డైలీ భారత్, నల్గొండ: కుటుంబ సభ్యులకు చెందిన భూములకు సంబంధించి సర్వే నివేదికను జారీ చేసేందుకు లంచం తీసుకున్న నల్గొండ ఆర్డీవో కార్యాలయ సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తల్లి, అత్తకు చెందిన భూముల సర్వే రికార్డు కోసం ఫిర్యాదుదారుడు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జి పవన్ కుమార్ను సంప్రదించగా రూ.35 వేలు లంచంగా డిమాండ్ చేశాడు.
ఇందులో భాగంగా మొదటి విడుతలో రూ.20 వేలు చెల్లించిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద మిగతా రూ. 15 వేలు అందజేశాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదుచేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >