Posted on 2026-06-12 07:46:06
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలోని చేనేత కళాకారుడు వెల్డి హరిప్రసాద్ హ్యూండ్లూమ్స్ ను నిజామాబాద్ లోని ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు బుధవారం సందర్శించారు. దారం నుంచి వస్త్రాం ఎలా తయారు చేస్తారన్న ప్రాసెస్ ను హరిప్రసాద్ వారికి వివరించారు. చేనేత కళాకారులు సాధారణ దారం నుంచి రంగు రంగుల డిజైన్ల చీరలను తయారు చేసే విధానాన్ని విద్యార్థులకి ప్రాక్టికల్ గా చూపించారు. అదే విధంగా హరిప్రసాద్ తయారు చేసిన అగ్గిపెట్టెలో చీర, ఉంగరం, సూది లో నుంచి దూరే చీరల గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గురించి కూడా విద్యార్థులకు హరిప్రసాద్ వివరించారు. సిరిసిల్ల పర్యటన తమకు మంచి అనుభవాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా విద్యార్థులు చెప్పారు. భవిష్యత్ లో తాము రూపొందించబోయే డిజైన్లకు హరిప్రసాద్ చేసిన సూచనలు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ సందర్శనలో సిరిసిల్ల వస్త్ర వ్యాపారి ఆడెపు రవీందర్, ప్రొఫెసర్లు మాధురి మదాస్, అక్షర తుంగేన, విద్యార్థులు పాల్గొన్నారు.
#hariprasadhandlooms #fashiondesigners #fashiondesigningstudent #veldihariprasd #weaver #weaving #student #sircillanews #sircillaupdates #sircilla #vairalvideo #vairalpost #trendingpost #trendingreels #trendingvideo #RajannaSiricillaDistrict #nizamabad #rajannasircilla
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >