Posted on 2026-06-11 18:19:12
టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్, డీఈఓ లకు వినతి
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలోని అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 100% ఫీజు రాయితీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ... జిల్లాలో 500 పైగా అర్హులైన జర్నలిస్టులు ఉన్నారు. వీరిలో పేద, మధ్యతరగతి కి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అందుకని వారి పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 100% ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ జీవో ప్రకారం 100% రాయితీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ కార్యాలయ సూపరిండెంట్ వరప్రసాద్, జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ లకు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్ , ఆబిద్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్, జర్నలిస్టులు శివ, శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, ముదాం శంకర్, వెంకటేశ్వర్లు, మాణిక్య శ్రీకాంత్, మధు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా వ్యాప్తంగా స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-06-11 20:54:40
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-11 20:20:24
Readmore >
ఖమ్మం చిన్నారి పై అత్యాచారానికి పాల్పడిన దోషినీ కఠినంగా శిక్షించాలి : బిజెపి పార్టీ తంబళ్ల రవి
Posted On 2026-06-11 20:19:16
Readmore >
విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం : ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం
Posted On 2026-06-11 18:57:59
Readmore >
అందుబాటులో ఉండాలి.. వైద్యం అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-11 18:49:50
Readmore >
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ
Posted On 2026-06-11 18:26:53
Readmore >
డిప్యూటీ ఈవో పోస్టులకు బిఈడీ,ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలి
Posted On 2026-06-11 18:24:17
Readmore >
దమ్మపేట మండలం సరోజ నాపురం కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న మదిశెట్టి సామేలు
Posted On 2026-06-11 18:20:26
Readmore >