Posted on 2026-06-11 14:49:12
టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్, డీఈఓ లకు వినతి
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలోని అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 100% ఫీజు రాయితీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ... జిల్లాలో 500 పైగా అర్హులైన జర్నలిస్టులు ఉన్నారు. వీరిలో పేద, మధ్యతరగతి కి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అందుకని వారి పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 100% ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ జీవో ప్రకారం 100% రాయితీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ కార్యాలయ సూపరిండెంట్ వరప్రసాద్, జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ లకు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్ , ఆబిద్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్, జర్నలిస్టులు శివ, శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, ముదాం శంకర్, వెంకటేశ్వర్లు, మాణిక్య శ్రీకాంత్, మధు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >