Posted on 2026-06-11 16:49:16
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట బిజెపి పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు,తంబళ్ల రవి మాట్లాడుతూ ఖమ్మంలో చిన్నారిపై జరిగిన హత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలీ,ఖమ్మం నగరంలో మానవత్వాన్ని మంటగలిపేలా,అత్యంత పశుప్రవృత్తితో ఒక చిన్నారిపై జరిగిన హత్యాచార సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని,మానసిక క్షోభను కలిగించింది,నిందితుడు మృగాడిలా ప్రవర్తించి,ఆపై పసిపాపను భవనం పైనుంచి కిందకు తోసి హత్య చేసిన తీరు సమాజం తలదించుకునేలా చేసిందనీ,ఈ అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము,సమాజంలో మహిళలు,ముఖ్యంగా పసిపిల్లలపై జరుగుతున్న ఇటువంటి దారుణాలు చట్టాల అమలు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మరియు రక్షణ వ్యవస్థలపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి,అమాయకపు చిన్నారి పై జరిగిన ఈ ఘటనలో నిందితుడిని ఏమాత్రం ఉపేక్షించకూడదనీ వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత,తంబళ్ల నాగేంద్ర,బీజేపీ సీనియర్ నాయకులు గుడా ముత్యాలరావు,దారా నాగేశ్వరావు ,పూచి ప్రసాద్ ,దారా మోహన్ రావు, సత్యనారాయణ,భూషణం,సాయి,నాగు తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >