| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా వ్యాప్తంగా స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

News

Posted on 2026-06-11 17:24:40

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా వ్యాప్తంగా స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

స్క్రాప్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

చోరీకి సంబంధించిన సొత్తు కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో నేరాల నియంత్రణ, చోరీ సొత్తు కొనుగోలు మరియు విక్రయాలను అరికట్టేడమే లక్ష్యంతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని  స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

ఈతనిఖీల్లో భాగంగా స్క్రాప్ దుకాణాల యజమానులు కొనుగోలు చేస్తున్న వస్తువులకు సంబంధించిన రికార్డులు, బిల్లులు, కొనుగోలుదారుల వివరాలను పరిశీలించి , అనుమానాస్పదంగా కనిపించే వస్తువులు, చోరీ సొత్తు కొనుగోలు చేయవద్దని, ప్రతి వస్తువుకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు.

తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్ర వాహనం, సర్వీస్ వైర్ కట్టలు, గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మోటార్లు, 03 కాపర్ వైర్ బెండలు దొరుకగా, విటికి సంబంధించి సరైన ఆధారాలు,పత్రాలు సమర్పించలేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.అనంతరం సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ గారు తెలిపారు.

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...స్క్రాప్ దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా కొనుగోలు, విక్రయాల రిజిస్టర్ నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు కూడా చోరీ సొత్తు కొనుగోలు, విక్రయాలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.

Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >