Posted on 2026-06-11 20:54:40
స్క్రాప్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
చోరీకి సంబంధించిన సొత్తు కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో నేరాల నియంత్రణ, చోరీ సొత్తు కొనుగోలు మరియు విక్రయాలను అరికట్టేడమే లక్ష్యంతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
ఈతనిఖీల్లో భాగంగా స్క్రాప్ దుకాణాల యజమానులు కొనుగోలు చేస్తున్న వస్తువులకు సంబంధించిన రికార్డులు, బిల్లులు, కొనుగోలుదారుల వివరాలను పరిశీలించి , అనుమానాస్పదంగా కనిపించే వస్తువులు, చోరీ సొత్తు కొనుగోలు చేయవద్దని, ప్రతి వస్తువుకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు.
తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్ర వాహనం, సర్వీస్ వైర్ కట్టలు, గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మోటార్లు, 03 కాపర్ వైర్ బెండలు దొరుకగా, విటికి సంబంధించి సరైన ఆధారాలు,పత్రాలు సమర్పించలేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.అనంతరం సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ గారు తెలిపారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...స్క్రాప్ దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా కొనుగోలు, విక్రయాల రిజిస్టర్ నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు.నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు కూడా చోరీ సొత్తు కొనుగోలు, విక్రయాలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా వ్యాప్తంగా స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-06-11 20:54:40
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-11 20:20:24
Readmore >
ఖమ్మం చిన్నారి పై అత్యాచారానికి పాల్పడిన దోషినీ కఠినంగా శిక్షించాలి : బిజెపి పార్టీ తంబళ్ల రవి
Posted On 2026-06-11 20:19:16
Readmore >
విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం : ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం
Posted On 2026-06-11 18:57:59
Readmore >
అందుబాటులో ఉండాలి.. వైద్యం అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-11 18:49:50
Readmore >
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ
Posted On 2026-06-11 18:26:53
Readmore >
డిప్యూటీ ఈవో పోస్టులకు బిఈడీ,ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలి
Posted On 2026-06-11 18:24:17
Readmore >
దమ్మపేట మండలం సరోజ నాపురం కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న మదిశెట్టి సామేలు
Posted On 2026-06-11 18:20:26
Readmore >