Posted on 2026-05-22 15:36:44
డైలీ భారత్, నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE ఆపరేషన్స్ ) ముద్దం రమణా రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ ( ACB ) అధికారులకు పట్టుబడ్డారు. విద్యుత్ శాఖ డివిజన్ పరిధిలో చేపట్టిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన రూ. 3 లక్షల 13,882 బిల్లుల మంజూరికి ఏడీఈ రూ.25 వేలు లంచంగా డిమాండ్ చేశారు.
దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా శుక్రవారం మధ్యాహ్నం కార్యాలయంలో రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డారు. ఏడీఈ వద్ద రూ. 25 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, హైదరాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని ఏసీబీ అధికారులు వివరించారు.
#acb #acb Telangana #Narsapur #Medak
రాజన్న సిరిసిల్ల జిల్లా : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కోళ్ల ఫారమ్ దగ్ధం..
Posted On 2026-05-22 20:06:53
Readmore >
గంజాయి అక్రమ రవాణాపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-22 19:31:49
Readmore >
అంతర్రాష్ట్ర దొంగలపై రైల్వే స్టేషన్లలో 24 గంటల పోలీసుల నిఘా
Posted On 2026-05-22 19:22:23
Readmore >
రేవంత్ రెడ్డి పీఏనని చెప్పుకుని వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..!!
Posted On 2026-05-21 23:23:22
Readmore >