Posted on 2026-05-21 11:42:53
ధాన్యం కొనుగోలు ప్రక్రియపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ధాన్యం అన్ లోడింగ్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, హమాలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ధాన్యం సేకరణ, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు, హమాలీల సంఖ్య పెంచడం, మిల్లుల్లో ధాన్యం అన్ లోడింగ్, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడం, తదితర అంశాలపై గురువారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, వ్యవసాయ, తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ముఖ్యంగా ఇప్పటికే లారీలు, ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు అపరెల్ పార్క్ కు తరలించిన వాహనాలు అన్ లోడ్ చేయడం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్ని వాహనాలు మిల్లుల వద్ద ఉన్నాయో సంబంధిత అధికారులను ఆరా తీశారు. గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. వర్షాలు పడితే కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా
Posted On 2026-05-21 20:49:41
Readmore >
శిక్షణ వినియోగించుకొని.. ఆర్థికంగా ఎదగాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-21 18:50:39
Readmore >
“డిప్రెషన్ - Depression" (బలహీనత కాదు… చికిత్స అవసరమైన మానసిక వ్యాధి)
Posted On 2026-05-21 18:34:59
Readmore >
ధాన్యం అన్ లోడింగ్ కోసం హమాలీల సంఖ్య పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-21 11:42:53
Readmore >
మళ్ళీ గంగ దేవి గుట్టను అక్రమంగా త్రవ్వడానికి ప్రయత్నించిన కాంట్రాక్టర్
Posted On 2026-05-21 08:19:55
Readmore >
సర్వే నెం. 444 లో అక్రమ నిర్మాణాలు... ఓ కార్పొరేటర్ అండతో అక్రమ నిర్మాణాల జాతర?
Posted On 2026-05-21 08:18:44
Readmore >