Posted on 2026-05-20 23:54:05
డైలీ భారత్, బోయినపల్లి: సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై, రైటర్ లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీ ( ACB ) అధికారులకు పట్టుబడ్డారు. ప్రేమ వివాహం చేసుకుని, తన తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదని సహాయం కోసం అభిషేక్ అనే యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
అయితే తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలని పోలీస్ స్టేషన్కు రావాలని ఎస్సై నందిత పిలిచి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో డబ్బులు ఇచ్చేందుకు అభిషేక్ నిరాకరిం చడంతో, తండ్రిని కొట్టాడని అభిషేక్పై కేసు నమోదు చేసి జైలు ( Jail ) కు పంపారు.
జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాక ప్రతీ సోమవారం సంతకం చేసేందుకు స్టేషన్కు వస్తున్న అభిషేక్ను రైటర్ విజయ్ రూ.10 వేలు , ఎస్సై నందిత రూ.30 వేలు డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఏసీబీ అధికారుల సూచనలతో లంచం ఇచ్చేందుకు బాధితుడు రాగా అతడికి తన స్కూటీ తాళం ఇచ్చి డిక్కీలో డబ్బులు పెట్టమని ఎస్సై సూచించారు. బాధితుడు స్కూటీలో డబ్బులు పెట్టగానే, ఎస్సై నందితను, రైటర్ విజయ్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలను సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-20 18:08:16
Readmore >
లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు, రిమాండ్
Posted On 2026-05-20 14:36:54
Readmore >
భర్తని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు హార్దిక సహాయం అందించిన చిన్ననాటి స్నేహితులు
Posted On 2026-05-20 08:50:43
Readmore >