| Daily భారత్
Logo




ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-05-19 10:58:44

Share: Share


ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం తరలింపు, అన్ లోడింగ్, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ, రైతులు, హమాలీలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై మంగళవారం ఉదయం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి పౌర సరఫరాల, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా ఇతర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 

జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తూకం వేయడం, తూకం వేసిన ధాన్యాన్ని నిర్దేశించిన మిల్లులు, గోదాములకు తరలించడంపై అధికారులు దృష్టి సారించి, క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, కొనుగోళ్ళ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. 

కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలను తరలించేందుకు సరిపడా వాహనాలను ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు సమాకూర్చాలని స్పష్టం చేశారు. 

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడింగ్ కోసం, మిల్లులు, అపరల్ పార్క్ లో ధాన్యం అన్ లోడింగ్ చేయడం కోసం హమాలీల సంఖ్యను మరింత పెంచాలని సూచించారు.

ఎండ తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో రైతులు, హమాలీలు అలాగే అన్ లోడింగ్ చేసే మిల్లులు, గోదాముల్లో హమాలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, తాగు నీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో పెట్టాలని సూచించారు. ఇంకా జిల్లాలో ఉన్న గోదాములను ధాన్యం అన్ లోడింగ్ చేసేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు.

రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ జాప్యం చేయవద్దని డీఆర్డీఓ, డీసీఓ, ఏవో మెప్మా, ఇతర అధికారులను ఆదేశించారు. ఆయా మండలాలకు చెందిన సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు తప్పనిసరిగా తనిఖీలు చేస్తూ సూచనలు చేయాలని సూచించారు.


#Sircilla #Sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district

Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >
Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >