Posted on 2026-05-18 15:57:39
డైలీ భారత్, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు నందు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 8 మంది ద్విచక్ర వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని సోమవారం 18.05.2026న సెకండ్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి శ్రీ ఆర్. శశిధర్ గారి ఎదుట హాజరుపర్చగా, అందులో 7 మందికి ఒక్కొక్కరికి రూ.1000/- జరిమానా విధించబడింది.
అలాగే ఒక ద్విచక్ర వాహనదారునికి 3 రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
#MahabubnagarPolice
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >