Posted on 2026-05-18 19:27:39
డైలీ భారత్, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు నందు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 8 మంది ద్విచక్ర వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని సోమవారం 18.05.2026న సెకండ్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి శ్రీ ఆర్. శశిధర్ గారి ఎదుట హాజరుపర్చగా, అందులో 7 మందికి ఒక్కొక్కరికి రూ.1000/- జరిమానా విధించబడింది.
అలాగే ఒక ద్విచక్ర వాహనదారునికి 3 రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
#MahabubnagarPolice
బంగాళాఖాతంలో భారీ మేఘాల ప్రభావం.. పలు రాష్ట్రాలకు హెచ్చరికలు
Posted On 2026-05-19 08:22:53
Readmore >
గోమతి నగర్ రైలులో దారుణం ఘటన...యువతిని ముక్కలుగా నరికి పెట్టెలో దాచారు ..!
Posted On 2026-05-19 08:21:33
Readmore >
జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన మాలోత్ మంగీలాల్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేసిన పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు
Posted On 2026-05-18 23:30:40
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల కఠిన చర్యలు – ఒకరికి జైలు శిక్ష.
Posted On 2026-05-18 19:27:39
Readmore >