| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో సంచలన తీర్పు....

News

Posted on 2026-05-18 14:12:14

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో సంచలన తీర్పు....

పది మంది నిందుతులకు యావజ్జీవకారాగార(జీవిత ఖైదు) శిక్ష

నేరం చేస్తే శిక్షలు తప్పవు,శిక్షలతోనే సమాజంలో మార్పు.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

డైలీ భారత్, బోయినపల్లి: బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన హత్య కేసులో పది(10) మంది నిందుతులకు యావజ్జీవకారాగార (జీవితఖైదు) శిక్ష,ఒక్కొక్కరికి 6500/- రూపాయల జరిమాన విధించినట్లు సోమవారం రోజున సిరిసిల్ల జిల్లా ప్రధాననాయమూర్తి నీరజ గారు కీలక తీర్పు వెల్లడించినట్లు  జిల్లా ఎస్పీ తెలిపారు.

నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, కోర్టు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు.

బోయినపల్లి మండలం స్థంబంపల్లి గ్రామానికి చెందిన తునికి లక్ష్మీనారాయణకి ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు అయినటువంటి మహేష్ అదే గ్రామానికి చెందిన బొంగానీ పరిశరాములు యొక్క కూతురు ఒకరికొకరు ప్రేమించుకున్నారు.ఇట్టి విషయం నచ్చని అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు బంధువులు( పది మంది) కలిసి అబ్బాయి వల్ల ఇంటి మీదకి గొడవకి పోయి అబ్బాయి కుటుంబ సభ్యులను కట్టెలతో రాడ్ లతో మరియు చేతులతో కొట్టగా అబ్బాయి తండ్రి అయినటువంటి తునికి లక్ష్మీనారాయణకి బాగా గాయాలు అయ్యి చనిపోయాడు.ఇట్టి కేసులో మృతిని భార్య అయిన తునికి విజయ పిర్యాదు మేరకు బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి పది మంది నిందుతులను రిమాండ్ కి తరలించారు.

అప్పటి వేములవాడ రూరల్ సీఐ నవీన్ కుమార్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా,ఈకేసు విచారణ దశలో అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్,కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ సరేష్ కుమార్ , రాజేంద్ర ప్రసాద్ , కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్ లు కోర్టులో 20 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున  గత పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించారు.శాస్త్రీయ ఆధారాలు మరియు సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో 10 మంది నిందుతులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి  6500/- రూపాయల జరిమానా విధించడం జరిగింది.

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరని, శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ సమన్వయంతో వ్యూహాత్మకంగా న్యాయ విచారణ, న్యాయ నిరూపణ నిర్వహించి నిందితులకు తప్పనిసరిగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.

పై కేసుల్లో నిందితులకు శిక్ష పడటంలో కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, పీపీలు పెంట శ్రీనివాస్, అప్పటి ,ప్రస్తుత సి.ఐ లు నవీన్ కుమార్, శ్రీనివాస్, సిఎంఎస్ ఎస్‌ఐ రవీందర్ నాయుడు, బోయినపల్లి ఎస్ ఐ రమాకాంత్,కోర్ట్ మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్‌,కోర్టు కానిస్టేబుల్ సరేష్ , రాజేంద్ర ప్రసాద్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >