| Daily భారత్
Logo




రైతుల మక్కల కొనుగోళ్లలో చిత్తశుద్ధి లేని ప్రభుత్వం

News

Posted on 2026-05-11 10:27:51

Share: Share


రైతుల మక్కల కొనుగోళ్లలో చిత్తశుద్ధి లేని ప్రభుత్వం

తడిసిన మొక్కజొన్నలను సైతం బేశరత్తుగా కొనుగోలు చేయాలి

ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట మార్కెట్ను సందర్శించిన ఏఐకెఎఫ్ బృందం

డైలీ భారత్, నర్సంపేట ప్రతినిధి: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్నలను మద్దతు ధరతో కొనుగోలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బేసరత్తుగా రైతుల మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాలలో తడిసిన మొక్కజొన్నలను సైతం ప్రభుత్వమే బాధ్యత వహించి కొనాలని కోరారు. 

అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) ఆధ్వర్యంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి మొక్కజొన్న రైతుల ఇబ్బందులను కొనుగోళ్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ జిల్లాలో ఒక లక్ష 7వేల ఎకరాలలో మొక్కజొన్నలు పండించారని సుమారు మూడు లక్షల 25 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వ యంత్రాంగానికి అంచనా ఉన్న అందుకు సరిపడా కొనుగోలు కేంద్రాలను యంత్రాంగాన్ని గోదాములను సిద్ధం చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. కావాలనే రైతుల మొక్కజొన్నలను మద్దతు ధరతో కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తూ పరోక్షంగా ప్రైవేటు వ్యాపారులకు దళారులకు వత్తాసు పలికి రైతులకు మద్దతు ధర రాకుండా చేస్తుందని, నెలరోజులపైగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు మక్కజొన్నలను కుప్పలు పోసి బస్తాలు నింపి కుటుంబానికి దూరంగా మార్కెట్లోనే రోజుల తరబడి గడుపుతూ నరకయాతన అనుభవిస్తున్న ప్రభుత్వానికి కనీస చలనం లేకపోవడం ఆందోళనకరమన్నారు. దీనికి తోడు అకాల వర్షాలు రైతులను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయని ఇప్పటికే కొన్నిచోట్ల అకాల వర్షాలకు రైతుల మొక్కజొన్నలు తడిసాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకని ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి తక్షణమే రైతుల మొక్కజొన్నలను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లేకపోతే రైతులకు జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబా బాబురావు ఎం సి పి ఐ (యు) డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ లతోపాటు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >