Posted on 2026-05-11 07:20:06
డైలీ భారత్, హైదరాబాద్/ సిరిసిల్ల: హైదరాబాద్లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (TPA) ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్గా, సైకాలజిస్ట్గా సేవలందిస్తున్న డాక్టర్ యెలగొండ ఆంజనేయులు కి “డికేడ్ ఆఫ్ సర్వీస్ అవార్డు 2026” ప్రదానం చేయబడింది.
సైకాలజీ రంగంలో దాదాపు పదేళ్లపాటు విశేష సేవలు అందించినందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందజేశారు. ఈ అవార్డును TPA రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరి రామచందర్ ఆధ్వర్యంలో, మాజీ గవర్నర్ మరియు కేంద్ర మంత్రిగా, వివిధ హోదాల్లో సేవలందించిన బండారు దత్తాత్రేయ మరియు మాజీ జాతీయ మహిళా కమిషన్ శ్రీమతి త్రిపురాణ వెంకట రత్నం గార్ల చేతుల మీదుగా ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది.
ఈ అవార్డు అందుకోవడం పట్ల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి, తోటి సైకాలజిస్ట్లు, అధ్యాపకులు, మిత్రులు, మేధావులు, ప్రముఖులు, విద్యావేత్తలు మరియు పలువురు అభినందనలు తెలియజేశారు. డా. ఆంజనేయులు గారి సేవలు మానసిక ఆరోగ్య అవగాహనకు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి విశేషంగా దోహదపడినట్లు వారు అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని సభలో పలువురు అభిప్రాయపడ్డారు.
విజయనగరం : సొంత ఖర్చులతో విద్యార్థిని విమానం ఎక్కించిన ఉపాధ్యాయుడు
Posted On 2026-05-11 07:23:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భీమారం సర్పంచ్ గీత వీరేశం గుప్తా
Posted On 2026-05-11 07:21:04
Readmore >
తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో డా. యెలగొండ ఆంజనేయులకు “డికేడ్ ఆఫ్ సర్వీస్ అవార్డు 2026”
Posted On 2026-05-11 07:20:06
Readmore >
“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”
Posted On 2026-05-10 13:12:35
Readmore >
కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-10 11:54:36
Readmore >