Posted on 2026-05-11 07:20:06
డైలీ భారత్, హైదరాబాద్/ సిరిసిల్ల: హైదరాబాద్లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (TPA) ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్గా, సైకాలజిస్ట్గా సేవలందిస్తున్న డాక్టర్ యెలగొండ ఆంజనేయులు కి “డికేడ్ ఆఫ్ సర్వీస్ అవార్డు 2026” ప్రదానం చేయబడింది.
సైకాలజీ రంగంలో దాదాపు పదేళ్లపాటు విశేష సేవలు అందించినందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందజేశారు. ఈ అవార్డును TPA రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరి రామచందర్ ఆధ్వర్యంలో, మాజీ గవర్నర్ మరియు కేంద్ర మంత్రిగా, వివిధ హోదాల్లో సేవలందించిన బండారు దత్తాత్రేయ మరియు మాజీ జాతీయ మహిళా కమిషన్ శ్రీమతి త్రిపురాణ వెంకట రత్నం గార్ల చేతుల మీదుగా ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది.
ఈ అవార్డు అందుకోవడం పట్ల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి, తోటి సైకాలజిస్ట్లు, అధ్యాపకులు, మిత్రులు, మేధావులు, ప్రముఖులు, విద్యావేత్తలు మరియు పలువురు అభినందనలు తెలియజేశారు. డా. ఆంజనేయులు గారి సేవలు మానసిక ఆరోగ్య అవగాహనకు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి విశేషంగా దోహదపడినట్లు వారు అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని సభలో పలువురు అభిప్రాయపడ్డారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >