Posted on 2026-05-10 13:12:35
డైలీ భారత్, హైదరాబాద్/ సిరిసిల్ల: మానసిక ఆరోగ్య రంగంలో గత 16 సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్కు ప్రతిష్టాత్మక “మైండ్ అండ్ మెరిట్ అవార్డ్” ప్రదానం చేయబడింది. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డును అందజేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్ తెలిపారు.
హైదరాబాద్లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి, జాతీయ మహిళా కమీషన్ చైర్మన్ త్రిపురాణ వెంకటరత్నం చేతుల మీదుగా కనుకుంట్ల పున్నంచందర్ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు మానసిక ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు, తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు పున్నంచందర్ను అభినందించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులు, యువత, కుటుంబాలకు కౌన్సెలింగ్ సేవలు అందించడం, ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించడం వంటి సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
కనుకుంట్ల పున్నంచందర్ మాట్లాడుతూ, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా మానసిక ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా కృషి కొనసాగిస్తానని తెలిపారు.
“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”
Posted On 2026-05-10 13:12:35
Readmore >
కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-10 11:54:36
Readmore >
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >