Posted on 2026-05-10 09:42:35
డైలీ భారత్, హైదరాబాద్/ సిరిసిల్ల: మానసిక ఆరోగ్య రంగంలో గత 16 సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్కు ప్రతిష్టాత్మక “మైండ్ అండ్ మెరిట్ అవార్డ్” ప్రదానం చేయబడింది. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డును అందజేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్ తెలిపారు.
హైదరాబాద్లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి, జాతీయ మహిళా కమీషన్ చైర్మన్ త్రిపురాణ వెంకటరత్నం చేతుల మీదుగా కనుకుంట్ల పున్నంచందర్ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు మానసిక ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు, తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు పున్నంచందర్ను అభినందించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులు, యువత, కుటుంబాలకు కౌన్సెలింగ్ సేవలు అందించడం, ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించడం వంటి సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
కనుకుంట్ల పున్నంచందర్ మాట్లాడుతూ, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా మానసిక ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా కృషి కొనసాగిస్తానని తెలిపారు.
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్సీఎస్టీ సభ్యుడు జాతోత్ హుస్సేన్కు కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం
Posted On 2026-08-24 14:09:34
Readmore >