Posted on 2026-05-10 13:12:35
డైలీ భారత్, హైదరాబాద్/ సిరిసిల్ల: మానసిక ఆరోగ్య రంగంలో గత 16 సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్కు ప్రతిష్టాత్మక “మైండ్ అండ్ మెరిట్ అవార్డ్” ప్రదానం చేయబడింది. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డును అందజేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్ తెలిపారు.
హైదరాబాద్లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి, జాతీయ మహిళా కమీషన్ చైర్మన్ త్రిపురాణ వెంకటరత్నం చేతుల మీదుగా కనుకుంట్ల పున్నంచందర్ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు మానసిక ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు, తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు పున్నంచందర్ను అభినందించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులు, యువత, కుటుంబాలకు కౌన్సెలింగ్ సేవలు అందించడం, ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించడం వంటి సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
కనుకుంట్ల పున్నంచందర్ మాట్లాడుతూ, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా మానసిక ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా కృషి కొనసాగిస్తానని తెలిపారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >