Posted on 2026-05-09 06:27:23
డైలీ భారత్, ఆంధ్రా ప్రదేశ్ డెస్క్: ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో ఓ మహిళ తాను డీఎస్పీ, కానిస్టేబుల్ అంటూ 40 లక్షల వరకు దోచుకొని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముద్దినాయన పల్లి గ్రామానికి చెందిన సరస్వతి, అనంత గ్రామీణ ఆలమూరుకి చెందిన రంగనాయకులు పరిచయస్తులు. రంగనాయకులకు వరుసకు తమ్ముడు అయిన రామానాయుడును సరస్వతి డిఎస్పి అంటూ పరిచయం చేశాడు. తాను డీఎస్పీ నని తన పిల్లలకు ఆరోగ్యం సరిగా లేదని చికిత్స చేయించాలంటూ పలుమార్లు రామానాయుడుతో రంగనాయకుల ద్వారా 40 లక్షల వరకు డబ్బులు అప్పుగా తీసుకుంది.దీనికి సంబంధించి ప్రాంసరీ నోట్లను రామానాయుడుకు రాసి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే కొంతకాలంగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ తాను డీఎస్పీ నంటూ నిత్యం బెదిరింపులకు పాల్పడుతోందని బాధితుడు రామానాయుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో అనంతపురం రూరల్ పోలీసులు రామానాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
సరస్వతి, రంగనాయకులు, రామానాయుడు వీరంతా కుటుంబ సభ్యులేనని పోలీసులు తెలిపారు. సరస్వతి తాను పోలీసును అంటూ మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ సీఐ పుల్లయ్య తెలిపారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >