Posted on 2026-05-09 06:27:23
డైలీ భారత్, ఆంధ్రా ప్రదేశ్ డెస్క్: ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో ఓ మహిళ తాను డీఎస్పీ, కానిస్టేబుల్ అంటూ 40 లక్షల వరకు దోచుకొని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముద్దినాయన పల్లి గ్రామానికి చెందిన సరస్వతి, అనంత గ్రామీణ ఆలమూరుకి చెందిన రంగనాయకులు పరిచయస్తులు. రంగనాయకులకు వరుసకు తమ్ముడు అయిన రామానాయుడును సరస్వతి డిఎస్పి అంటూ పరిచయం చేశాడు. తాను డీఎస్పీ నని తన పిల్లలకు ఆరోగ్యం సరిగా లేదని చికిత్స చేయించాలంటూ పలుమార్లు రామానాయుడుతో రంగనాయకుల ద్వారా 40 లక్షల వరకు డబ్బులు అప్పుగా తీసుకుంది.దీనికి సంబంధించి ప్రాంసరీ నోట్లను రామానాయుడుకు రాసి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే కొంతకాలంగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ తాను డీఎస్పీ నంటూ నిత్యం బెదిరింపులకు పాల్పడుతోందని బాధితుడు రామానాయుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో అనంతపురం రూరల్ పోలీసులు రామానాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
సరస్వతి, రంగనాయకులు, రామానాయుడు వీరంతా కుటుంబ సభ్యులేనని పోలీసులు తెలిపారు. సరస్వతి తాను పోలీసును అంటూ మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ సీఐ పుల్లయ్య తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >