Posted on 2026-05-08 17:04:59
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాది ఆడెపు వేణు అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి/కార్యదర్శి, డిఎల్ఎస్ఏ పి.లక్ష్మణాచారి సమన్వయంతో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల భద్రత, హక్కుల పరిరక్షణ మరియు లైంగిక వేధింపుల నివారణ లక్ష్యంగా జాతీయ న్యాయ సేవాధికర సంస్థ (నాల్సా) మార్గదర్శకాల మేరకు “జాగృతి” పథకం – 2025 కింద “సురక్షిత్ బచ్పన్ సురక్షిత్ భవిష్య” కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన
న్యాయ విజ్ఞాన సదస్సులో బాలలపై లైంగిక నేరాల నుండి రక్షణ కల్పించే పోక్సో చట్టం (పోక్సో యాక్ట్ – 2012) పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. పిల్లలు ఎలాంటి భయాందోళనలకు గురైనా వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సదస్సులో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎస్. మల్లేశ్ యాదవ్, లోక్ అదాలత్ సభ్యులు గుర్రం ఆంజనేయులు, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >