Posted on 2026-04-27 18:44:58
డైలీ భారత్, కామారెడ్డి:మాంసాహారం వండలేదన్న విషయంలో మొదలైన చిన్నపాటి గొడవలో క్షణికావేశానికి గురైన భార్య.. భర్తపైకి కొడవలి విసరడంతో అతను అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లాకేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
కామారెడ్డి పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. గోసంగికాలనీకి చెందిన కోదండం శివాజీ(28), లక్ష్మికి 2017లో వివాహమైంది. వీరికి ఐదేళ్లు, రెండేళ్లలోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మి ఇళ్లలో పనికి వెళ్తుండగా.. శివాజీ పాత సామాన్ల వ్యాపారం చేసేవారు. శనివారం రాత్రి ఇంటికి చేరుకున్న శివాజీ మాంసాహారం ఎందుకు వండలేదని భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్దగా అరుచుకున్నారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి సముదాయించడంతో కాసేపు ఊరుకున్నారు. మళ్లీ తనను తిట్టడంతో కోపోద్రిక్తురాలైన లక్ష్మి అక్కడే ఉన్న కొడవలిని శివాజీపైకి బలంగా విసిరారు. అది అతని మెడ భాగంలోని నరానికి తగిలి తీవ్ర రక్తస్రావమై 15 నిమిషాల వ్యవధిలోనే చనిపోయారు.
క్షణికావేశంలో భర్తనే చంపుకొన్నానని, తాను జైలుకు వెళితే పిల్లలను ఎవరు చూసుకుంటారని ఇద్దరు బిడ్డలను ఒడిలోకి తీసుకొని లక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. శివాజీ సోదరుడు సూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >
ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు
Posted On 2026-04-27 18:49:15
Readmore >
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు
Posted On 2026-04-27 18:47:54
Readmore >
కాకర్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి హాట్ అండ్ కూల్ వాటర్ డిస్పెన్సర్ అందజేసిన దాత అల్లాడిగోపి
Posted On 2026-04-27 18:46:32
Readmore >