Posted on 2026-04-27 10:39:19
బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఉద్యమ నేతగా, తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలకు పదేళ్లు సుపరిపాలన అందించారని బీఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా తల్లాడ లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు(జి వి ఆర్) అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా రైతులకు వరి, మొక్కజొన్న కొనుగోలు లేకపోవడంతో వారు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లాడ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు చిన్నబ్బాయి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, షేక్ కమల్, ఏలూరు రఘు, సంఘసాని శ్రీనివాసరావు, డేగల సురేష్, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >