Posted on 2026-04-27 10:40:31
డైలీ భారత్, అశ్వాపురం: మండలంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అశ్వాపురం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధన రథసారథి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు, గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సబ్బండవర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేశారని అన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి రానుందని తెలిపారు. అనంతరం మిఠాయిలు, పండ్లు పంచి సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >