Posted on 2026-04-23 15:29:41
లింగాయపల్లి గ్రామంలో ఐదో వార్డుకు నూతన బోర మోటర్ ఏర్పాటు
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామంలోని ఐదో వార్డులో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతన బోరు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాజయ్య మాట్లాడుతూ, ఉప సర్పంచ్ తోట శిరీష భూపతి గారు కొత్త మోటర్ ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చేయడం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కృషి కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. కొత్త బోరు మోటర్ ఏర్పాటు వల్ల ఐదో వార్డు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శిరీష భూపతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి నవనీత, గ్రామ పాలకవర్గ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ చర్యపై సంతోషం వ్యక్తం చేస్తూ, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >