| Daily భారత్
Logo




నిడదవోలులో మహిళా సాధికారతకు మద్దతుగా సీఎం చంద్రబాబు నిరసన ర్యాలీ

News

Posted on 2026-04-18 13:41:10

Share: Share


నిడదవోలులో మహిళా సాధికారతకు మద్దతుగా సీఎం చంద్రబాబు నిరసన ర్యాలీ

డైలీ భారత్, నిడదవోలు : తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి పరిధిలోని నిడదవోలులో మహిళా సాధికారత బిల్లుకు మద్దతుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. పార్లమెంటులో మహిళల హక్కులకు విఘాతం కలిగిందని, ఇది దేశానికి “బ్లాక్ డే”గా మిగిలిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న ఆశలను ప్రతిపక్షాలు ధ్వంసం చేశాయని సీఎం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు దాని మిత్రపక్షాలు భారతీయ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించాయని, మహిళలకు ఇది ద్రోహమని తీవ్రంగా స్పందించారు.

“ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు” అన్న మన సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ, అలాంటి విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిదని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని, కానీ రాజకీయాల్లో మాత్రం వివక్ష చూపడం బాధాకరమని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే పేరుతో బిల్లును వ్యతిరేకించాయని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేసినా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు.

మూడున్నర దశాబ్దాలుగా మహిళా సాధికారత కోసం పోరాడుతున్నామని చెప్పిన సీఎం, నిన్న పార్లమెంట్ సాక్షిగా ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని అన్నారు. “ఏ ముఖం పెట్టుకుని ప్రతిపక్షాలు రేపు మహిళల ఓట్లు అడుగుతాయి?” అంటూ ప్రశ్నించారు.

పంచాయతీ స్థాయిలో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఉద్యోగ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని గుర్తుచేశారు. అలాంటి సమయంలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బిల్లును అడ్డుకోవడం క్షమించరాని చర్యగా అభివర్ణించారు.

వచ్చే ఎన్నికల్లో మహిళలతో ద్రోహం చేసిన పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన సీఎం, నిడదవోలులో ప్రారంభమైన ఈ పోరాటాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. “ఇది ప్రారంభం మాత్రమే… ఇక్కడితో ఆగదు” అని హెచ్చరించారు.

Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >