Posted on 2026-04-18 09:08:38
పోలీసు అధికారులను ఆహ్వానించిన కమిటీ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో ఏప్రిల్ 26, 2026న నిర్వహించనున్న “హిందూ సమ్మేళనం” కార్యక్రమానికి సంబంధించి, సమ్మేళనం కమిటీ సభ్యులు మరింత కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు.
ఈ సందర్భంగా హిందూ సమ్మేళనం కమిటీ సభ్యులు కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిసి, సమ్మేళనం కార్యక్రమానికి ఆహ్వానం అందజేశారు. కార్యక్రమం యొక్క లక్ష్యాలు, ఏర్పాట్లు మరియు ప్రజల పాల్గొనిక గురించి వివరించారు.
కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, హిందూ సమాజంలో ఐక్యత, ధర్మ పరిరక్షణ, సాంప్రదాయ విలువల పరిరక్షణ లక్ష్యంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం శాంతియుతంగా మరియు క్రమబద్ధంగా నిర్వహించబడుతుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా డి.ఎస్.పి కార్యక్రమం గురించి తెలుసుకుని, చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది.
ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షులు పి. వీరవర్ధనరావు, కార్యదర్శి లట్టి జగన్ మోహన్, సభ్యులు యెల్దండి పూర్ణచందర్ రావు, వెంకట్ రెడ్డి, రాజేశ్వరరావు, మరియు న్యాయవాది పాతూరి పాండురంగ విటల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. విజయ్ కుమార్కు ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి "ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారం"
Posted On 2026-06-03 09:58:42
Readmore >
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >