Posted on 2026-04-12 18:45:08
డైలీ భారత్, కామారెడ్డి: ఇంటర్ ఫలితాలుఆదివారం విడుదలయ్యాయి.ఈ సందర్భంగా కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని వీఆర్కే(VRK College) విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు.వీఆర్కే ఇంటర్ ఫలితాలు ఫస్ట్, సెకండియర్లలో ఆదివారం విడుదలైన ఫలితాలలో ఇంటర్మీడియట్ బైపీసీ సెకండియర్ విద్యార్థిని ఎ. నవోదయ 994 మార్కులు సాధించగా ఎంపీసీ సెకండ్ ఇయర్ విద్యార్థిని పి మైథిలి 993 మార్కులు, సీఈసీ సెకండియర్ విద్యార్థిని అనన్య 982, ఎంపిహెచ్ డబ్ల్యు సెకండ్ ఇయర్ విద్యార్థిని ఎం.అఖిల 987 మార్కులు సాధించారు. అలాగే ఎంపీసీ ఫస్టియర్ విద్యార్థిని నాష్ట్ర జమ 466/470, బైపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని శిరీష 436/440, బైపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని జోబియా తన్వీర్ 435/440, సీఈసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మదీనా 483 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరితోపాటు చాలామంది విద్యార్థులకు 900 కు పైగా మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల సీఈవో, కరస్పాండెంట్ డా. ఎం. జైపాల్ రెడ్డి అభినందించారు.
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >