Posted on 2026-04-12 18:47:01
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో జూద స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: ఏడుగురు పట్టివేత
జిల్లాలో అక్రమ పేకాట స్థావరాలపై నిఘా కొనసాగుతోంది – చట్టపరమైన చర్యలు తప్పవు
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: జూదం అనేది కేవలం ఒక వ్యసనం మాత్రమే కాదు; అది ఒక కుటుంబం యొక్క ఆర్థిక పునాదులను కూల్చే సామాజిక మహమ్మారి. క్షణికానందం కోసం జూదానికి బానిసలైతే, అది అప్పుల ఊబిలోకి నెడుతూ, చివరికి ఆత్మహత్యల వంటి దారుణ పరిణామాలకు దారితీస్తుంది. ప్రజలు, ముఖ్యంగా యువత, ఇటువంటి అక్రమ మార్గాలకు దూరంగా ఉండి బాధ్యతాయుత పౌరులుగా తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలి.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ గారు స్పష్టం చేశారు.
రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇసన్నపల్లి గ్రామ శివారులో అక్రమంగా జూదం ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు, ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ. 7,710 నగదుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు.
జిల్లాలో ఎక్కడైనా ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి సమాచారం అందించాలని పోలీస్ శాఖ కోరుతోంది. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వడానికి సంబంధిత పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు కాల్ చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ తెలిపారు
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >