Posted on 2026-04-12 18:47:01
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో జూద స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: ఏడుగురు పట్టివేత
జిల్లాలో అక్రమ పేకాట స్థావరాలపై నిఘా కొనసాగుతోంది – చట్టపరమైన చర్యలు తప్పవు
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: జూదం అనేది కేవలం ఒక వ్యసనం మాత్రమే కాదు; అది ఒక కుటుంబం యొక్క ఆర్థిక పునాదులను కూల్చే సామాజిక మహమ్మారి. క్షణికానందం కోసం జూదానికి బానిసలైతే, అది అప్పుల ఊబిలోకి నెడుతూ, చివరికి ఆత్మహత్యల వంటి దారుణ పరిణామాలకు దారితీస్తుంది. ప్రజలు, ముఖ్యంగా యువత, ఇటువంటి అక్రమ మార్గాలకు దూరంగా ఉండి బాధ్యతాయుత పౌరులుగా తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలి.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ గారు స్పష్టం చేశారు.
రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇసన్నపల్లి గ్రామ శివారులో అక్రమంగా జూదం ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు, ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ. 7,710 నగదుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు.
జిల్లాలో ఎక్కడైనా ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి సమాచారం అందించాలని పోలీస్ శాఖ కోరుతోంది. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వడానికి సంబంధిత పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు కాల్ చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ తెలిపారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >