డైలీ భారత్, వైరా: కళ కల కోసం కాదని, ప్రజల కోసమని, ప్రజా కళలు వర్ధిల్లాలని నినాదంతో ఈనెల 15 16 17 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నామాలక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.
ప్రజానాట్యమండలి వైరా డివిజన్ ముఖ్యుల సమావేశం చెరుకు మళ్ళీ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరగగా ఆయన మాట్లాడుతూ సామ్రాజ్యవాదం మతోన్మాద విష సంస్కృతి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని భారతదేశం నిజమైన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుటకు ప్రజానాట్యమండలి కృషి చేస్తుందని ఈ ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణం కై రాష్ట్ర మహాసభల్లో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలకు పిలుపునిస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారుల పట్ల కళా ప్రజా కలల పట్ల చేస్తున్న నిర్లక్ష్య ధోరణి పై తీర్మానాలను ఆమోదించి ప్రజా కళల అభివృద్ధికి ప్రజా ఉద్యమాలకు సంఘీభావంగా ప్రజలను ఒడగట్టి నూతన సంస్కృతి కోసం కృషి చేస్తుందని లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజానాట్యమండలి నిర్మాణానికి కావలసిన సహకారాన్ని సంఘీభావాన్ని ప్రజలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రజానాట్యమండలి నాయకులు కరకపల్లి రాయమల్లు, కే నరేంద్ర, రుద్రాక్షల నరసింహ చారి, ఆదిమాళ్ళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.