Posted on 2026-04-11 08:51:32
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందించే లక్ష్యంతో, సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డు వద్ద కొత్తగా 33/11కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి శుక్రవారం తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ అనుమతులు మంజూరు చేసిందని రాజన్న సిరిసిల్ల సూపెరింటెండింగ్ ఇంజనీర్ బేతి బిక్షపతి తెలిపారు. ఈ సందర్బంగా బిక్షపతి మాట్లాడుతూ.. ఈ సబ్స్టేషన్ నిర్మాణానికి మొత్తం రూ. 2,81,48,000/- (రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు) నిధులు కేటాయించారు. ఈ కేంద్రంలో 1x5.0 ఎంవిఏ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ పంపిణీని క్రమబద్ధీకరించడానికి ఈ సబ్స్టేషన్ నుండి 4 కొత్త 11కేవీ ఫీడర్లను (ఫీడర్-1, 2, 3, 4) నిర్మించనున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ , లోడ్ విపరీతంగా పెరుగుతోంది. క్షేత్రస్థాయి అధికారుల నివేదికల ఆధారంగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈ తెలిపారు.
ఈ కొత్త సబ్స్టేషన్ అందుబాటులోకి రావడం ద్వారా సిరిసిల్ల మండలంలోని వేలాది మంది వినియోగదారులకు మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుందని తెలిపారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >