Posted on 2026-04-11 08:51:32
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందించే లక్ష్యంతో, సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డు వద్ద కొత్తగా 33/11కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి శుక్రవారం తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ అనుమతులు మంజూరు చేసిందని రాజన్న సిరిసిల్ల సూపెరింటెండింగ్ ఇంజనీర్ బేతి బిక్షపతి తెలిపారు. ఈ సందర్బంగా బిక్షపతి మాట్లాడుతూ.. ఈ సబ్స్టేషన్ నిర్మాణానికి మొత్తం రూ. 2,81,48,000/- (రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు) నిధులు కేటాయించారు. ఈ కేంద్రంలో 1x5.0 ఎంవిఏ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ పంపిణీని క్రమబద్ధీకరించడానికి ఈ సబ్స్టేషన్ నుండి 4 కొత్త 11కేవీ ఫీడర్లను (ఫీడర్-1, 2, 3, 4) నిర్మించనున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ , లోడ్ విపరీతంగా పెరుగుతోంది. క్షేత్రస్థాయి అధికారుల నివేదికల ఆధారంగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈ తెలిపారు.
ఈ కొత్త సబ్స్టేషన్ అందుబాటులోకి రావడం ద్వారా సిరిసిల్ల మండలంలోని వేలాది మంది వినియోగదారులకు మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుందని తెలిపారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >