డైలీ భారత్, కామారెడ్డి: ప్రముఖ తెలుగు కవి నందిని తెలంగాణ రాష్ట్ర తొలి సాహిత్య అకాడమీ ఛైర్మెన్ నందిని సిధారెడ్డికి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నందుకు RTI రాష్ట్ర కార్యదర్శి లెగ్గేల రాజు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించారు.
అనంతరం ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ సిధారెడ్డికి పురస్కారం అందజేయడం పురస్కారంలో భాగంగా రూ.లక్షతో పాటు తామ్రపత్రం బహూక రించి సిధారెడ్డి "అనిమేష" కవితా సంకలనానికి ఈ పురస్కారం అందిస్తు న్నట్లు ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు . ఇప్పటి వరకు సిదారెడ్డి 20 పుస్తకాలు రచించారు అని దాశరథి అవార్డుతోపాటు అనేక పురస్కారాలు అందుకున్నారు అనిమేషలో కరోనా విపత్తు సమయంలో మనిషి అనుభవిం చిన వేదనను కవితాత్మకంగా పొందుపరిచారని, ప్రకృతికి, మనిషికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో కవిత్వం రాశారని ఒక తాత్విక దృక్పథంతో రాసిన ఈ కవిత కరోనా విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి గొప్ప నివాళి వంటిదని, తెలుగు కవిత్వంలో ఇది ఉత్తమ రచనగా నిలుస్తుందని కేంద్ర సాహిత్య అకాడమీ ఛైర్మెన్ కొనియాడటం సంతోష కారమైన విషయం అని ఇంకా ఎన్నో రచనలు చేసి ఎన్నో అవార్డులు అందుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో RTI రాష్ట్ర కార్యదర్శి లెగ్గేల రాజు, జిల్లా ప్రధాన సలహా దారులు దండుల.లింగమయ్య చందు తదితరులు పాల్గొన్నారు...