Posted on 2026-04-03 09:28:57
డైలీ భారత్, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాచీన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో చాళుక్యుల కాలం నుండి సుమారు 700 సంవత్సరాలుగా నిరంతరాయంగా వెలుగుతున్న అఖండ జ్యోతి (నందా దీపం)కు విశిష్ట గుర్తింపు లభించింది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అరుదైన విశేషంగా నిలిచిన ఈ పవిత్ర జ్యోతి, నిజాం కాలం నుండి నేటి వరకు ఎప్పుడూ ఆరిపోకుండా వెలుగుతుండటం గ్రామ ప్రజల అచంచల భక్తి, సంప్రదాయ పరిరక్షణ, మరియు ఆధ్యాత్మిక నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ జ్యోతి గ్రామానికి ఐశ్వర్యం, సుభిక్షం, ధాన్యసమృద్ధి ప్రసాదిస్తుందని స్థానిక భక్తులు గాఢ విశ్వాసంతో భావిస్తున్నారు.
గ్రామస్తులు నిత్యం ఇంధనం సమకూర్చి ఈ పవిత్ర జ్యోతిని కొనసాగిస్తూ రావడం ఒక అరుదైన సామూహిక ఆధ్యాత్మిక సేవగా గుర్తించబడింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విశిష్ట అఖండ జ్యోతి పరంపరను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రత్యేక రికార్డుగా గుర్తించింది. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్ చైర్మన్ డా.చింతపట్ల వేంకటా చారి, డా.టి.వి.అశోక్ కుమార్ తిరునగరి చేతుల మీదుగా ఆలయ ప్రతినిధులకు ప్రత్యేక గుర్తింపు సర్టిఫికేట్ సగర్వంగా ప్రదానం చేశారు. ఈ గుర్తింపు గంభీరావుపేట గ్రామ ఆధ్యాత్మిక వైభవాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత వెలుగులోకి తీసుకురానుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >