Posted on 2026-04-03 09:28:57
డైలీ భారత్, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాచీన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో చాళుక్యుల కాలం నుండి సుమారు 700 సంవత్సరాలుగా నిరంతరాయంగా వెలుగుతున్న అఖండ జ్యోతి (నందా దీపం)కు విశిష్ట గుర్తింపు లభించింది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అరుదైన విశేషంగా నిలిచిన ఈ పవిత్ర జ్యోతి, నిజాం కాలం నుండి నేటి వరకు ఎప్పుడూ ఆరిపోకుండా వెలుగుతుండటం గ్రామ ప్రజల అచంచల భక్తి, సంప్రదాయ పరిరక్షణ, మరియు ఆధ్యాత్మిక నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ జ్యోతి గ్రామానికి ఐశ్వర్యం, సుభిక్షం, ధాన్యసమృద్ధి ప్రసాదిస్తుందని స్థానిక భక్తులు గాఢ విశ్వాసంతో భావిస్తున్నారు.
గ్రామస్తులు నిత్యం ఇంధనం సమకూర్చి ఈ పవిత్ర జ్యోతిని కొనసాగిస్తూ రావడం ఒక అరుదైన సామూహిక ఆధ్యాత్మిక సేవగా గుర్తించబడింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విశిష్ట అఖండ జ్యోతి పరంపరను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రత్యేక రికార్డుగా గుర్తించింది. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్ చైర్మన్ డా.చింతపట్ల వేంకటా చారి, డా.టి.వి.అశోక్ కుమార్ తిరునగరి చేతుల మీదుగా ఆలయ ప్రతినిధులకు ప్రత్యేక గుర్తింపు సర్టిఫికేట్ సగర్వంగా ప్రదానం చేశారు. ఈ గుర్తింపు గంభీరావుపేట గ్రామ ఆధ్యాత్మిక వైభవాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత వెలుగులోకి తీసుకురానుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >