Posted on 2026-04-01 05:45:44
డైలీ భారత్, గంభరాపేట: స్థానిక గంభరాపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనే అంశం పైన సర్టిఫికెట్ కోర్స్ కు సంబంధించి ముగింపు సమావేశం డాక్టర్ యెలగొండ ఆంజనేయులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ మరియు ఇన్చార్జ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
డాక్టర్ యెలగొండ ఆంజనేయులు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంచార్జ్ మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులందరూ తమ తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుపరచుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని, తగిన ఉదాహరణలతో సమయస్ఫూర్తిని అలవర్చుకొని పేరు ప్రతిష్టలతో వెలుగొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఏ రంగంలోనైనా రాణించాలంటే, ఉన్నత రంగంలో స్థిర పడాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అత్యంత ఆవశ్యకమని ముగింపు కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
డి రమ్య లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఏ రంగంలోనైనా సమాచార నైపుణ్యాలతో ఎక్స్ట్రార్డినరీగా ఆదర్శంగా నిలవచ్చని తగిన ఉదాహరణలతో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ్ కుమార్, సుచరణ్, శ్రీనివాస్, మనోహర్, క్రుష్ణ ప్రసాద్, మహేష్ తదితర అధ్యాపకులు అధ్యాపకేతర మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల - ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో "కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ " పై సర్టిఫికెట్ కోర్స్ ముగింపు సమావేశం
Posted On 2026-04-01 05:45:44
Readmore >
మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-31 11:28:48
Readmore >
గంజి శ్రీదేవి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం
Posted On 2026-03-31 10:55:55
Readmore >
కామారెడ్డి ప్రీమియర్ లీగు : ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం రూ.1.20 లక్షల విరాళం
Posted On 2026-03-31 10:54:41
Readmore >