Posted on 2026-03-31 11:42:14
మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని విజయవాడ తరలించాము
మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
డైలీ భారత్, కృష్ణా జిల్లా: గతేడాది అక్టోబరు నెలలో అక్రమంగా టపాసులు నిల్వ ఉంచిన వారి దగ్గర నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నామని, వాటిని మంగళవారం కోర్టులో సబ్మిట్ చేయటానికి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసిన క్రమంలో పేలినట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మంగళవారం చల్లపల్లి పోలీస్ స్టేషన్లో టపాసులు పేలి ఐదుగురికి గాయాలు కావటంతో సంఘటనా ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీజ్ చేసిన టపాసులను కోర్టులో సబ్మిట్ చేసే క్రమంలో కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఎస్ఐ దుర్గాంజనేయులుకు స్వల్ప గాయాలు కాగా, ముగ్గురిని విజయవాడ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ పార్వతీ, హెడ్ కానిస్టేబుల్ తేజ చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. సీజ్ చేసిన టపాకాయలు స్టేషన్ కు దూరంగా ఉంచటం జరిగిందని, కోర్టు ఆర్డర్స్ రావటంతో వాటిని కోర్టులో సబ్మిట్ చేయటానికి తీసిన క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాదమికంగా నిర్ధారించటం జరిగిందన్నారు. రాష్ట్ర హోం మంత్రి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత లు తీసుకుంటామని తెలిపారు.
మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-31 11:28:48
Readmore >
గంజి శ్రీదేవి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం
Posted On 2026-03-31 10:55:55
Readmore >
కామారెడ్డి ప్రీమియర్ లీగు : ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం రూ.1.20 లక్షల విరాళం
Posted On 2026-03-31 10:54:41
Readmore >
హనుమాన్ జయంతి ర్యాలీ మార్గాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-03-31 10:53:12
Readmore >
కలెక్టరేట్ వద్ద బకాయిల సాధన కొరకు రిటైర్డ్ ఉద్యోగస్తుల నిరసన
Posted On 2026-03-31 08:48:45
Readmore >
కామారెడ్డి విశాల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సినీ నటి నిధి అగర్వాల్
Posted On 2026-03-31 06:32:08
Readmore >