Posted on 2026-03-31 12:53:12
• ర్యాలీ రూట్ మ్యాప్ పరిశీలన – అధికారులకు కీలక ఆదేశాలు
• శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి.
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా : ఏప్రిల్ 02న హనుమాన్ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో నిర్వహించనున్న శోభాయాత్ర మార్గం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, IAS , జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS మంగళవారం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు.
ర్యాలీ సజావుగా, శాంతియుత వాతావరణంలో జరిగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించి పలు కీలక సూచనలు చేశారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ర్యాలీ సాగే రూట్ మ్యాప్ను పరిశీలించిన వారు, మార్గంలోని ప్రధాన కూడళ్ల ను సందర్శించి ట్రాఫిక్ నియంత్రణ , బందోబస్తు ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు.
అనంతరం ర్యాలీ నిర్వహణ ప్రతినిధులతో కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వేడుకలను క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ లు మాట్లాడుతూ, పట్టణంలోని ముఖ్య మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలు , సీసీటీవీల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు.
ఇతరులకు ఇబ్బంది కలగకుండా భక్తులు , నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి ఈ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, IPS, ఎస్.హెచ్.ఓ నరహరి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ , ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >