| Daily భారత్
Logo




కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు నేరవేర్చాలి

News

Posted on 2026-03-30 14:24:51

Share: Share


కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు నేరవేర్చాలి

మహిళలకు 2500/- హామీని వెంటనే అమలు చేయాలి 

వివాహ సమయంలో తులం బంగారం ఇవ్వాలి

విద్యార్ధినీలకు స్కూటీలు పంపిణీ  చేయాలి 

హమీల అమలుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలి.

ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత.

వైరా రూరల్ అధ్యక్షురాలు బాణాల వెంకట్రావమ్మ.

డైలీ భారత్, వైరా: మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మహిళలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని, హామీల అమలు కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, మండల అధ్యక్షురాలు బాణాల వెంకట్రావమ్మ అన్నారు. వైరా మండలం అష్టగుర్తి గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) గ్రామ కమిటీని 19 మంది సభ్యులతో ఎన్నుకున్నారు. ఐద్వా అష్ణగుర్తి గ్రామం అధ్యక్షురాలుగా మోదుగు లక్మి, కార్యదర్శిగా కంచర్ల రమాదేవి, ఉపాధ్యక్షురాలుగా కంచర్ల అనూష, సహాయ కార్యదర్శిగా నారపోగు జమలమ్మ, కంచర్ల స్రవంతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత, బాణాల వెంకట్రావమ్మ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో మహిళలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గడిచిన రెండున్నరేండ్లుగా వాటిని అమలు చేయకుండా మహిళలను మోసం చేసిందని, బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ఇంకా మహిళలను మభ్యపెట్టాలని చూస్తున్నదని విమర్శించారు. వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని మహిళలను నమ్మించి ఓట్లు వేయించుకొని, అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మహిళకు నెలకు రూ.2500, పెళ్లి సమయంలో తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హామీలిచ్చి బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా కాంగ్రెస్‌ మహిళలను మోసగించిందని విమర్శించారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ ఐద్వా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అష్ణగుర్తి సర్పంచ్ కంచర్ల అనిత, 9వ వార్డు మెంబర్ కంచర్ల వెంకటమ్మ, ఐద్వా గ్రామ కమిటీ సభ్యులు కంచర్ల మరియమ్మ, కంచర్ల బుల్లెమ్మ, కంచర్ల లక్ష్మి, కంచర్ల సునీత, కంచర్ల జయమ్మ, పెద్దప్రోలు చిన్న వెంకమ్మ, ఆదిమళ్ళ రమణ, మోదుగు దుర్గ, మోదుగు లలిత, గంధం బాగ్యమ్మ, గంధం శ్రావణి, ఆదిమళ్ళ వసంత, కారుమంచి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >