Posted on 2026-03-29 18:22:30
అడ్మిషన్ గ్యారంటీ, తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తాo అంటూ అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్ల మోసాలు.
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్
డైలీ భారత్, కర్నూలు : ఇంజనీరింగ్, మెడికల్ మరియు బీటెక్ సీట్ల పేరుతో అడ్వాన్స్ పేమెంట్లు తీసుకుంటూ జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
కొందరు సైబర్ నేరగాళ్లు ప్రముఖ కళాశాలలు, విశ్వవిద్యాలయాల పేరుతో ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు, ఫేక్ వెబ్సైట్ల ద్వారా సంప్రదిస్తూ “మేనేజ్మెంట్ కోటా సీట్ల ” పేరుతో అడ్వాన్స్ బుకింగ్ డబ్బులు అడిగి మోసాలు చేస్తారన్నారు.
అడ్మిషన్ గ్యారంటీ, తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తామని చెప్పి అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులను మోసాలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయన్నారు .
జిల్లా ప్రజలకు ఎస్పీ సూచనలు...
ఏ కళాశాల సీటు కోసం అయినా అధికారిక వెబ్సైట్ లేదా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే దరఖాస్తు చేయాలి.
ఫోన్ కాల్స్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆఫర్లను నమ్మి డబ్బులు పంపవద్దు.
వ్యక్తిగత బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరికీ ఇవ్వకూడదు.
అనుమానాస్పద లింకులు, APK ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దు.
ఎవరైనా సైబర్ మోసానికి గురి అయితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి.
జరిగిన సైబర్ నేరం గురించి వెంటనే లేదా ఒక గంటలోపు ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని కర్నూల్ ఎస్పీ తెలిపారు.
విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, కేవలం అధికారిక విధానాల ద్వారానే అడ్మిషన్లు పొందాలని కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#APPOLICE100 #AndhraPradeshPolice
#PoliceKurnool #APPolice #appolice
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >