| Daily భారత్
Logo




ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో సైబర్ మోసాలు

News

Posted on 2026-03-29 16:22:30

Share: Share


ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో  సైబర్ మోసాలు

అడ్మిషన్ గ్యారంటీ, తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తాo అంటూ అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్ల మోసాలు.

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్

డైలీ భారత్, కర్నూలు : ఇంజనీరింగ్, మెడికల్ మరియు బీటెక్ సీట్ల పేరుతో అడ్వాన్స్ పేమెంట్లు తీసుకుంటూ జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

కొందరు సైబర్ నేరగాళ్లు ప్రముఖ కళాశాలలు, విశ్వవిద్యాలయాల పేరుతో ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా సంప్రదిస్తూ “మేనేజ్‌మెంట్ కోటా సీట్ల ” పేరుతో అడ్వాన్స్ బుకింగ్ డబ్బులు అడిగి మోసాలు చేస్తారన్నారు.

అడ్మిషన్ గ్యారంటీ, తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తామని చెప్పి అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులను మోసాలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయన్నారు .

జిల్లా ప్రజలకు ఎస్పీ సూచనలు...

ఏ కళాశాల సీటు కోసం అయినా అధికారిక వెబ్‌సైట్ లేదా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే దరఖాస్తు చేయాలి.

ఫోన్ కాల్స్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆఫర్లను నమ్మి డబ్బులు పంపవద్దు.

వ్యక్తిగత బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరికీ ఇవ్వకూడదు.

అనుమానాస్పద లింకులు, APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దు.

ఎవరైనా సైబర్ మోసానికి గురి అయితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. 

జరిగిన సైబర్ నేరం గురించి వెంటనే లేదా ఒక గంటలోపు ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని కర్నూల్ ఎస్పీ తెలిపారు. 

విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, కేవలం అధికారిక విధానాల ద్వారానే అడ్మిషన్లు పొందాలని కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

#APPOLICE100 #AndhraPradeshPolice

#PoliceKurnool #APPolice #appolice

Image 1

నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ

Posted On 2026-04-02 07:41:02

Readmore >
Image 1

జడల చింత గ్రామంలో శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రతిష్ట మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ ధర్మకర్త కలసాని దుర్గ ప్రవీణ్

Posted On 2026-04-02 07:30:03

Readmore >
Image 1

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు

Posted On 2026-04-02 06:54:11

Readmore >
Image 1

జాతీయ ఈ.ఎం.టీ. డే (ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్) దినోత్సవం

Posted On 2026-04-02 06:52:45

Readmore >
Image 1

గ్రామసభలను ప్రజలు వినియోగించుకోవాలి

Posted On 2026-04-02 05:45:28

Readmore >
Image 1

అక్రమ నిర్మాణము... నిలిపివేతకు కోర్టు స్టే ఆర్డర్

Posted On 2026-04-02 05:01:24

Readmore >
Image 1

సెస్ విలీనంపై నిరసనలకు కేటీఆర్ పిలుపు..

Posted On 2026-04-02 03:19:01

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో నిలిచిన స్కానింగ్ సేవలు

Posted On 2026-04-02 03:17:46

Readmore >
Image 1

హనుమజ్జయంతి ..

Posted On 2026-04-02 03:12:07

Readmore >
Image 1

మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : సెస్ ఎండీ బిక్షపతి

Posted On 2026-04-02 03:08:24

Readmore >