Posted on 2026-03-28 19:16:33
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్లో అక్రమంగా నడుస్తున్న బేకరీ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ మరియు గుడిమల్కాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి గుట్టు రట్టు చేశారు. అనుమతులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం పదార్థాలతో బిస్కెట్లు, రస్కులు, బన్లు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.
నిందితుడు: అహ్మద్ రజా (46).
స్వాధీనం: రూ. 12.54 లక్షల విలువైన ముడి పదార్థాలు, యంత్రాలు.
భారీగా నిల్వలు: మైదా, చక్కెర, పామాయిల్, నెయ్యి, బిస్కెట్లు, రస్కులు.
ఈ నకిలీ ఉత్పత్తులను నగరంలోని కిరాణా దుకాణాలు, హోటళ్లు, కేఫ్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలు ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >