Posted on 2026-03-27 16:52:33
జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మరియు బాన్సువాడ పట్టణాల్లో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ తెలిపారు. భక్తులు ప్రశాంతంగా, సురక్షితంగా పండుగను జరుపుకునేలా అన్ని కీలక ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని మోహరించడం జరిగింది.
పట్టణాల ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేకంగా సర్వే లెన్స్ 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎల్ఈడి స్క్రీన్ వ్యాన్ పై , డ్రోన్ల సహాయంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నదని ఎస్పీ పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లా ఎస్పీ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేసి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మతసామరస్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని మరొక్కసారి గుర్తు చేశారు
సుజాతనగర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు
Posted On 2026-03-27 11:21:28
Readmore >
108 జిల్లా మేనేజర్ (ఈ ఎం ఈ )పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Posted On 2026-03-27 11:18:23
Readmore >
పాపకొల్లు శ్రీ ఉమా స్వామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలు
Posted On 2026-03-27 08:53:44
Readmore >
కాకర్ల గ్రామం : చెంగల గురునాథం ని పరామర్శించినా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
Posted On 2026-03-26 13:46:04
Readmore >