Posted on 2026-03-27 17:52:33
జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మరియు బాన్సువాడ పట్టణాల్లో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ తెలిపారు. భక్తులు ప్రశాంతంగా, సురక్షితంగా పండుగను జరుపుకునేలా అన్ని కీలక ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని మోహరించడం జరిగింది.
పట్టణాల ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేకంగా సర్వే లెన్స్ 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎల్ఈడి స్క్రీన్ వ్యాన్ పై , డ్రోన్ల సహాయంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నదని ఎస్పీ పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లా ఎస్పీ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేసి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మతసామరస్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని మరొక్కసారి గుర్తు చేశారు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >