Posted on 2026-03-27 13:15:58
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్వప్నలోక్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని స్వప్నలోక్ కార్యవర్గం, కాలనీవాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారని ఆలయ అర్చకులు శ్రీహర్ష తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ రామనవమి సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయంలో అఖండ నామము, సుప్రభాతసేవ, మూల విరాట్లకు, ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం, మంగళస్నానం, సహస్రనామార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం పల్లకీ సేవలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, 11వ వార్డ్ కౌన్సిలర్ రాణి శ్రీనివాస్, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
సుజాతనగర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు
Posted On 2026-03-27 11:21:28
Readmore >
108 జిల్లా మేనేజర్ (ఈ ఎం ఈ )పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Posted On 2026-03-27 11:18:23
Readmore >
పాపకొల్లు శ్రీ ఉమా స్వామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలు
Posted On 2026-03-27 08:53:44
Readmore >
కాకర్ల గ్రామం : చెంగల గురునాథం ని పరామర్శించినా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
Posted On 2026-03-26 13:46:04
Readmore >