| Daily భారత్
Logo




మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు...

News

Posted on 2026-03-23 19:00:13

Share: Share


మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు...

జిల్లాలో ఒకే రోజు 105 మందికి కోర్టు శిక్షలు

05 మందికి రెండు రోజు జైలు శిక్ష, 9 మందికి ఒక  రోజు జైలు శిక్ష,  రూ.1,27,500 జరిమానా విధింపు

మీ భద్రతే మా లక్ష్యం.. మద్యం మత్తులో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయం – జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు 

జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, ఐపిఎస్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడం మరియు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పెద్ద సంఖ్యలో వాహనదారులు పట్టుబడ్డారు.

వీరిలో 105 మందిని ఈ రోజు పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జరిమానాలు మరియు జైలు శిక్షలు విధించింది. 05 మందికి రెండు రోజుల జైలు శిక్ష, 9 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి కలిపి మొత్తం రూ. 1,27,500 జరిమానా విధించడం జరిగింది. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి మరియు ఇటువంటి బాధ్యతారాహిత్యపు పనులను అరికట్టడానికి పోలీస్ శాఖ ఈ కఠిన చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం కేవలం చట్టవిరుద్ధమే కాకుండా, తోటి ప్రయాణికుల మరియు పాదచారుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పెట్టడమేనని తీవ్రంగా హెచ్చరించారు. క్షణికానందం కోసం మద్యం మత్తులో వాహనాలు నడిపి, నిండు జీవితాలను రోడ్డు ప్రమాదాల పాలు చేసుకోవద్దని ఆయన వాహనదారులకు సూచించారు. ఒక వ్యక్తి చేసే ఈ చిన్న పొరపాటు వల్ల ఎన్నో కుటుంబాలు తమ పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

"మీ భద్రతే మా లక్ష్యం" అని పేర్కొన్న ఎస్పీ గారు, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. బాధ్యతాయుతమైన ప్రయాణమే మీ కుటుంబ భవిష్యత్తుకు అసలైన భరోసా అని, ప్రజలందరూ పోలీసులకు సహకరించి రోడ్డు రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >