Posted on 2026-03-23 13:30:13
జిల్లాలో ఒకే రోజు 105 మందికి కోర్టు శిక్షలు
05 మందికి రెండు రోజు జైలు శిక్ష, 9 మందికి ఒక రోజు జైలు శిక్ష, రూ.1,27,500 జరిమానా విధింపు
మీ భద్రతే మా లక్ష్యం.. మద్యం మత్తులో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయం – జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడం మరియు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పెద్ద సంఖ్యలో వాహనదారులు పట్టుబడ్డారు.
వీరిలో 105 మందిని ఈ రోజు పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జరిమానాలు మరియు జైలు శిక్షలు విధించింది. 05 మందికి రెండు రోజుల జైలు శిక్ష, 9 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి కలిపి మొత్తం రూ. 1,27,500 జరిమానా విధించడం జరిగింది. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి మరియు ఇటువంటి బాధ్యతారాహిత్యపు పనులను అరికట్టడానికి పోలీస్ శాఖ ఈ కఠిన చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం కేవలం చట్టవిరుద్ధమే కాకుండా, తోటి ప్రయాణికుల మరియు పాదచారుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పెట్టడమేనని తీవ్రంగా హెచ్చరించారు. క్షణికానందం కోసం మద్యం మత్తులో వాహనాలు నడిపి, నిండు జీవితాలను రోడ్డు ప్రమాదాల పాలు చేసుకోవద్దని ఆయన వాహనదారులకు సూచించారు. ఒక వ్యక్తి చేసే ఈ చిన్న పొరపాటు వల్ల ఎన్నో కుటుంబాలు తమ పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
"మీ భద్రతే మా లక్ష్యం" అని పేర్కొన్న ఎస్పీ గారు, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. బాధ్యతాయుతమైన ప్రయాణమే మీ కుటుంబ భవిష్యత్తుకు అసలైన భరోసా అని, ప్రజలందరూ పోలీసులకు సహకరించి రోడ్డు రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
అక్రమ బేకరీపై పోలీసుల దాడి – భారీగా కల్తీ ఉత్పత్తులు స్వాధీనం, ఒకరి అరెస్ట్
Posted On 2026-03-28 13:46:33
Readmore >
సుజాతనగర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు
Posted On 2026-03-27 11:21:28
Readmore >
108 జిల్లా మేనేజర్ (ఈ ఎం ఈ )పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Posted On 2026-03-27 11:18:23
Readmore >
పాపకొల్లు శ్రీ ఉమా స్వామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలు
Posted On 2026-03-27 08:53:44
Readmore >