Posted on 2026-03-23 13:28:08
డైలీ భారత్, కామారెడ్డి: 10వ తరగతి మూల్యాంకన పారితోషికం పెంచాలని కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్. రాజు కి వినతి పత్రం సమర్పిస్తున్న పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంబీర్ మనోహర్ రావు, జనపాల లక్ష్మీరాజం
పదో తరగతి మూల్యాంకన పారితోషికం పెంచాలని పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా పక్షాన గౌరవ కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్. రాజు కి వినతి పత్రం సమర్పించడమైనది. గతంలో పదో తరగతి 2 పేపర్లుగా ఉండేవి కానీ ప్రస్తుతం ప్రశ్నల సంఖ్య పెరిగి ఒకే పేపర్ గా డిజైన్ చేయడం జరిగింది కాబట్టి మూల్యాంకనం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల మూల్యాంకన పారితోషికం ప్రస్తుతం ఉన్న దానికి 50 శాతం పెంచాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి రాష్ట్ర పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ పీ వీ హరి కి ఫార్వర్డ్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
గత సంవత్సర పదో తరగతి మూల్యాంకన నిధులు విడుదల చేయాలని కోరడం జరిగింది. దానికి వారు స్పందిస్తూ ఈ వారంలో నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్పారు
అక్రమ బేకరీపై పోలీసుల దాడి – భారీగా కల్తీ ఉత్పత్తులు స్వాధీనం, ఒకరి అరెస్ట్
Posted On 2026-03-28 13:46:33
Readmore >
సుజాతనగర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు
Posted On 2026-03-27 11:21:28
Readmore >
108 జిల్లా మేనేజర్ (ఈ ఎం ఈ )పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Posted On 2026-03-27 11:18:23
Readmore >