Posted on 2026-03-21 07:01:03
డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 18వ తేదీన చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్.. ఇల్లంతకుంట మండలం సీతంపేటలోని అత్తగారింట్లో ఉరివేసుకున్నాడు.
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్య(30)కు 2016లో దేసు చంద్రశేఖర్తో వివాహమైంది. ప్రస్తుతం వీరు కరీంనగర్లోని హనుమాన్నగర్లో ఉంటుండగా.. చంద్రశేఖర్ టూటౌన్లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు.
చంద్రశేఖర్ రోజుమాదిరిగా మంగళవారం ఇద్దరు పిల్లలను పాఠశాలలో వదిలి డ్యూటీకి వెళ్లాడు. కాగా దివ్య కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమె గన్నేరుపూలు, ఆకులు మిక్సీ చేసుకొని తాగింది. విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్చేసి చెప్పింది. సమాచారం తెలిసిన భర్త దివ్యను హైదరాబాద్లోని హాస్పిటల్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
కాగా, దివ్య మృతికి చంద్రశేఖర్ కారణమని.. ఆమె అంత్యక్రియల సందర్భంగా ఎస్సైపై సీతంపేట గ్రామస్తులు దాడి చేశారు. ఆ సమయంలో ఆ దాడిని దివ్య తండ్రి అడ్డుకోవడం గమనార్హం.
పాపకొల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన రోకటి రంగారావు
Posted On 2026-03-29 05:45:21
Readmore >
ఇద్దరు సైబర్ నేరస్తులను అరెస్టు చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు
Posted On 2026-03-29 05:43:27
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా పుల్లూరి జగదీశ్వరరావు
Posted On 2026-03-29 05:42:29
Readmore >
రాజన్న సిరిసిల్ల : ప్రైవేట్ ఆసుపత్రుల స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంఎచ్ఓ
Posted On 2026-03-28 17:03:27
Readmore >