| Daily భారత్
Logo




విధి నిర్వహణలో మృతి..

News

Posted on 2026-03-21 11:43:34

Share: Share


విధి నిర్వహణలో మృతి..

వీధిన పడ్డ కుటుంబానికి న్యాయం చేయాలి...

బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

13 రోజులుగా "ప్రతిమ" ప్రాజెక్టు గేటు వద్దే బాధితుల దీక్ష...అధికారులకు చలనం లేదు

రెండు నెలలు అవుతున్న అందని పరిహారం.. ఎమ్మెల్యే హామీ ఏమైందని ప్రశ్న

మృతుని కుటుంబానికి  రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం సీతారామ ప్రాజెక్టు వద్ద నిరాహార దీక్ష చేస్తున్న మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ పూసుగూడెం వద్ద పనులు నిర్వహిస్తున్న ‘ప్రతిమ ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్’ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ మరణించిన జంపయ్య కుటుంబానికి నేటికీ న్యాయం జరగలేదు,విధి నిర్వహణలో ఉండగా అనుమానాస్పద స్థితిలో మరణించి రెండు నెలలు కావస్తున్నా,అటు అధికారులు కానీ,కాంట్రాక్టర్ కానీ బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం లేదని,తమకు న్యాయం చేయాలంటూ గత 13రోజులుగా ప్రాజెక్టు ప్రధాన గేటు వద్దే టెంట్ వేసుకొని నిరసన తెలుపుతున్నా యాజమాన్యం స్పందించకపోవడంపై పలు అనుమానాలకు దారి తీస్తుందని,జంపయ్య మరణించిన సమయంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు సంబంధిత అధికారులు వచ్చి బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని..న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని,ఆ నమ్మకంతోనే అప్పట్లో కుటుంబ సభ్యులు శాంతించారు,తీరా రెండు నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు,గత 8 ఏళ్లకు పైగా ఇక్కడే నమ్మకంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు,వారిది అత్యంత నిరుపేద కుటుంబం ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయినారు,కంపెనీ యాజమాన్యం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని,లేని పక్షంలో అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు,ఇ కార్యక్రమం లో బీజేపీ నియోజకవర్గం నాయుకులు తంబళ్ల రవి,సీనియర్ నాయుకులు గూడా ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >