| Daily భారత్
Logo




ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2026-03-19 18:50:54

Share: Share


ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి ఇంటా సంతోషాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా చైర్మన్  మాట్లాడుతూ ఉగాది పండుగ కొత్త ఆరంభాలకు ప్రతీక అని, ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, విజయాలు తీసుకురావాలని కోరుకున్నారు. ముఖ్యంగా రైతులు సుభిక్షంగా ఉండటం రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

రైతులకు ఆధునిక సాంకేతికత, నీటి వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన వివరించారు. పంటల ఉత్పాదకత పెంపుతో పాటు రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఈ కొత్త సంవత్సరంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందిస్తూ అందరూ కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.ఉగాది పర్వదినం తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, ఐశ్వర్యాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు.

Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >
Image 1

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-02 17:42:33

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >