Posted on 2026-03-16 17:04:46
డైలీ భారత్, మణుగూరు: మణుగూరు మండలం పగడేరు గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పలగుంపు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై కూలిపోయిన వంతెనను పునర్నిర్మాణం చేయాలని గ్రామస్థులు సోమవారం నిర్వహించిన ప్రజావాణి, ప్రజాదర్భ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజుకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, తమ గ్రామంలో సుమారు 80 గిరిజన కుటుంబాలు గత 50 సంవత్సరాలుగా నివసిస్తూ పోడు వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పలగుంపు గ్రామం నుంచి పగడేరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి తమకు ఏకైక రవాణా మార్గమని చెప్పారు. ఈ మార్గం ద్వారానే పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడం జరుగుతుందని, అలాగే గ్రామస్తులు నిత్యావసర వస్తువుల కొనుగోలు మరియు అత్యవసర వైద్య సేవల కోసం ఇదే రహదారిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారిపై ఉన్న వంతెన తీవ్రంగా దెబ్బతిని కుంగిపోయిందని తెలిపారు. ప్రస్తుతం ఆ వంతెన రోజురోజుకు మరింత కూలిపోతూ ప్రమాదకరంగా మారిందని చెప్పారు. రాబోయే వర్షాకాలంలో వంతెన పూర్తిగా కూలిపోయే అవకాశం ఉండడంతో గ్రామం బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్ల సంబంధిత అధికారులు స్పందించి ఇప్పలగుంపు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెనను అత్యవసరంగా పునర్నిర్మాణం చేయాలని గ్రామస్థులు కోరారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >