| Daily భారత్
Logo




ఇప్పలగుంపు గ్రామ రహదారిపై కూలిన వంతెన పునర్నిర్మాణం చేయాలని ప్రజావాణిలో వినతి

News

Posted on 2026-03-16 17:04:46

Share: Share


ఇప్పలగుంపు గ్రామ రహదారిపై కూలిన వంతెన పునర్నిర్మాణం చేయాలని ప్రజావాణిలో వినతి

డైలీ భారత్, మణుగూరు: మణుగూరు మండలం పగడేరు గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పలగుంపు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై కూలిపోయిన వంతెనను పునర్నిర్మాణం చేయాలని గ్రామస్థులు సోమవారం నిర్వహించిన ప్రజావాణి, ప్రజాదర్భ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజుకు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, తమ గ్రామంలో సుమారు 80 గిరిజన కుటుంబాలు గత 50 సంవత్సరాలుగా నివసిస్తూ పోడు వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పలగుంపు గ్రామం నుంచి పగడేరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి తమకు ఏకైక రవాణా మార్గమని చెప్పారు. ఈ మార్గం ద్వారానే పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడం జరుగుతుందని, అలాగే గ్రామస్తులు నిత్యావసర వస్తువుల కొనుగోలు మరియు అత్యవసర వైద్య సేవల కోసం ఇదే రహదారిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.

గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారిపై ఉన్న వంతెన తీవ్రంగా దెబ్బతిని కుంగిపోయిందని తెలిపారు. ప్రస్తుతం ఆ వంతెన రోజురోజుకు మరింత కూలిపోతూ ప్రమాదకరంగా మారిందని చెప్పారు. రాబోయే వర్షాకాలంలో వంతెన పూర్తిగా కూలిపోయే అవకాశం ఉండడంతో గ్రామం బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అందువల్ల సంబంధిత అధికారులు స్పందించి ఇప్పలగుంపు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెనను అత్యవసరంగా పునర్నిర్మాణం చేయాలని గ్రామస్థులు కోరారు.

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >