Posted on 2026-03-16 08:32:23
డైలీ భారత్ స్పెషల్: శీర్షిక: ప్రజా ఐక్యత గీతం
పర్వత శిఖరములపై పలికిన కవితా నాదమది
పృథ్వీ గర్భమంతట పరిమళించి విరజిల్లె;
భాషల గోడలన్నియు భగ్నమగునని బోధించి
భావాల సేతువై మానవ హృదయములను కలిపె.
కులమత భేదముల కలుషిత చీకటిలో
కరుణా కాంతిరేఖలై కవిత వెలుగె;
విభేద వలయముల విరిచి సమత్వ మార్గమున
సామరస్య సుగంధమై సమాజమున పరచె.
పేదవాని నిశ్వాసము, ధనవాని గర్వగీతము
ఒకే రాగమై కలిసిన క్షణమున
సమానత్వ సత్యమై సమాజ గర్భమందు
స్నేహ స్వరమై సర్వలోకమున మార్మోగె.
సరిహద్దు రేఖలతో భూమిని చీల్చిన చేతులకన్నా
స్నేహసూత్రమే శాశ్వతమని కాలమే చెప్తుంది;
మనసుల నదులన్నియు ఒకే సముద్రమై చేరగా
మానవత్వమే జగతికి మహాసంగీతమవుతుంది.
కావున కవిత కేవలం పదాల అలంకారముకాదు—
ప్రజల హృదయాలను కలిపే పవిత్ర జ్యోతి అది;
ప్రపంచ కవితా స్వరమై మార్మోగిన వేళ
ప్రజల ఐక్యత రాగమే భూమికి శాశ్వత గీతమవుతుంది.
రచన: మంజుల పత్తిపాటి
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >