Posted on 2026-03-16 08:32:23
డైలీ భారత్ స్పెషల్: శీర్షిక: ప్రజా ఐక్యత గీతం
పర్వత శిఖరములపై పలికిన కవితా నాదమది
పృథ్వీ గర్భమంతట పరిమళించి విరజిల్లె;
భాషల గోడలన్నియు భగ్నమగునని బోధించి
భావాల సేతువై మానవ హృదయములను కలిపె.
కులమత భేదముల కలుషిత చీకటిలో
కరుణా కాంతిరేఖలై కవిత వెలుగె;
విభేద వలయముల విరిచి సమత్వ మార్గమున
సామరస్య సుగంధమై సమాజమున పరచె.
పేదవాని నిశ్వాసము, ధనవాని గర్వగీతము
ఒకే రాగమై కలిసిన క్షణమున
సమానత్వ సత్యమై సమాజ గర్భమందు
స్నేహ స్వరమై సర్వలోకమున మార్మోగె.
సరిహద్దు రేఖలతో భూమిని చీల్చిన చేతులకన్నా
స్నేహసూత్రమే శాశ్వతమని కాలమే చెప్తుంది;
మనసుల నదులన్నియు ఒకే సముద్రమై చేరగా
మానవత్వమే జగతికి మహాసంగీతమవుతుంది.
కావున కవిత కేవలం పదాల అలంకారముకాదు—
ప్రజల హృదయాలను కలిపే పవిత్ర జ్యోతి అది;
ప్రపంచ కవితా స్వరమై మార్మోగిన వేళ
ప్రజల ఐక్యత రాగమే భూమికి శాశ్వత గీతమవుతుంది.
రచన: మంజుల పత్తిపాటి
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >