Posted on 2026-03-11 11:57:50
రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ఉపవాసాల సందర్భంగా (పాత పాల్వంచలోని మజిద్-ఎ-మహ్మదీయ మజిద్ లో మంగళవారం రాత్రి కొత్వాల తోపాటు ఆయన సతీమణి 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి దంపతులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుఏర్పాటు చేశారు. మజిద్ కమిటీ సభ్యులు కొత్వాల ను పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఎంతో నియమ నిష్టలతో ముస్లింలు ఉపవాస దీక్షలు చేస్తారని, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మజిద్ కమిటీ సభ్యులు షేక్ జానీమియా, షేక్ ఖాజామియా, షేక్ ఖయ్యుమ్, MD ఇమామ్, షేక్ యాకుబ్, షేక్ హయమత్ , షేక్ షాకీర్, షేక్ నజీర్, సయ్యద్ యాకుబ్, కరీమ్, ఖుర్షిద్, వాసుమల్ల సుందర్ రావు, వనమా చినబాబు, చిన్న పండు, తిరుపతి, యాటా నాని, యాదా నరసింహారావు తదితరులుఈ కార్యక్రమంలోపాల్గొన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >