Posted on 2026-03-11 15:58:37
డైలీ భారత్ స్పెషల్: శీర్షిక: ప్రకృతి గర్భగుడి
మన హృదయం ప్రకృతి గర్భగుడిగా మారిన వేళ,
వర్షపు చినుకులు అభిషేకాలై జలజలా కురిశాయి.
గాలుల సున్నిత నాదం మంత్రోచ్ఛారణై పలికిన వేళ,
పక్షుల గానధారలు ఘంటానాదాలై మార్మోగాయి.
భూమి ఒడిలో మొలిచిన ప్రతి పచ్చ మొగ్గ,
దైవసాన్నిధ్యపు మౌన ప్రతిమగా నిలిచింది.
సూర్యకిరణాలు హారతులై వెలుగులు చిందించగా,
చంద్రకాంతి కరుణా ప్రసాదంలా జాలువారింది.
కానీ —
మనిషి మనసులో మొలిచిన స్వార్థపు ముళ్లు
ఆ ప్రకృతి గర్భగుడిని గాయపరిచాయి.
అసూయ అనే అగ్నికణం ఎగసి పడిన వేళ
హృదయ పవిత్రత బూడిదగా మారింది.
అహంకారం అనే అంధకారం కమ్ముకున్నప్పుడు
ఆత్మదీపం మసకబారింది.
ద్వేషం అనే విషగాలి వీచిన క్షణంలో
జీవన వనమే వాడిపోయింది.
అడవులను నరికిన కత్తుల ధ్వని
మనిషి ఊపిరినే మూలం నుంచి కోసేసింది.
పక్షుల గానాలు నిశ్శబ్దంలో కలిసిపోతూ
ప్రకృతి ఆలయం శూన్యంగా మారింది.
మన హృదయం మళ్లీ పవిత్రమైతేనే
ప్రకృతి గర్భగుడి తిరిగి వెలుగుతుంది.
మన ప్రేమే హారతి, మన కరుణే పూజగా మారితే
ఈ భూమి మళ్లీ దైవాలయంగా వికసిస్తుంది.
పకృతిని కాపాడాలని కోరుకుంటూ...
మ
మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >
అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు
Posted On 2026-05-04 18:49:53
Readmore >